డాక్టర్‌ ఎల్లాకు రామినేని పురస్కారం

విజయవాడ,నవంబర్‌6 (జనంసాక్షి):   డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలను ప్రకటించారు. భారత్‌ బయోటిక్‌ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లాతో పాటు భారత్‌ బయోటిక్‌ జేఎండీ సుచిత్రా ఎల్లకు విశిష్ట పురస్కారం లభించింది. నటుడు బ్రహ్మానందం, నిమ్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దుర్గా పద్మజ, పాత్రికేయుడు ఎస్‌వీ.రామారావుకు విశేష పురస్కారం లభించింది. త్వరలో పురస్కార ప్రదానోత్సవాన్ని రామినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ అందించనుంది.