డిసెంబ‌ర్ 28 నుంచి ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

సంక్రాంతి పండుగ వరకు రైతులందరి ఖాతాల్లో  జమ .
— మొత్తం 7,600. కోట్లు విడుదల.
– ఆర్థిక మంత్రి టి. హరీష్ రావ్.
సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 19:(జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల తో   డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసిఆర్ ఆదేశించారని తెలిపారు . రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయని ఇందుకోసం గాను రూ. 7,600 కోట్ల‌ను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నదిని తెలిపారు.
రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నదని అన్నారు.
ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు తో పాటు, రైతు బీమా తో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయం లో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుందని అన్నారు.
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా. దేశ వ్యవసాయరంగ నమూనా మార్పు  కు దారితీసిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్  వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు,ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయన్నారు.
దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను,కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
పలు మార్గాలనుండి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టి ఉందన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా,ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు.
కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ది విషయం లో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతు బంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నదని తెలిపారు.
ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలం లో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీ కి సీఎం కేసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు.
ఈ నిర్ణయం, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం కేసిఆర్ పాలనకున్న చిత్తశుద్ది కి నిదర్శనంగా నిలిచిందన్నారు