డీఆర్డీఓలో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: ఒడిశాలోని చాందీపూర్ డీఆర్డీఓలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయుధాలు భద్రపరిచే భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న 13 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని… ఘటనపై విచారణకు అదేశించినట్లు డీఆర్డీవో ప్రతినిధి రవిగుప్తా తెలిపారు.