ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజన్‌లో శుక్రవారం అత్యల్ప ఉష్ణాగ్రత 2.7 డీగ్రీలు నమోదైంది. నిన్న 4.4 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణ్రోగ్రత అత్యల్ప స్థాయికి పడిపోవడంతో భారీగా పోగ మంచు పేరుకుపోయి రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది, ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.