ఢిల్లీలో మరో రెండు స్వైన్ ప్లూ మరణాలు
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో రెండు స్వైన్ప్లూ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 510 మందికి స్వైన్ప్లూ పరీక్షలు పాజిటివ్ వచ్చాయి. పుణెలో రెండు సీరియన్ కేసులు, ఒక మరణం నమోదైనట్లు సమాచారం, గుజరాత్లో కూడా స్వైన్ప్లూ కారణంగా ఈ ఏడాది 30 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జ్వరం, ఒళ్లు నొప్పులకు తోడు శ్వాస ఇబ్బందులు కూడా తతెత్తితే వెంటనే వైద్య సహాయం తీసుకోవలసిందిగా వైద్యులు ప్రజలను హెచర్చరిస్తున్నారు.