ఢిల్లీ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య
న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్ జైల్లో ఈ ఉదయం 5 గంటలకు రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. నిందితుడు జైల్ నెంబర్ 3లో గుడ్డతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని దీన్దయార్ ఆసుపత్రికి. తరలించారు. గత డిసెంబర్ 16న దక్షిణ ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సులో దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్ధిని సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ఓ మైనర్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో బస్సు డ్రైవర్ రాంసింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.