ఢిల్లీ చేరిన బాధితురాలి మృతదేహం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో అత్యాచారానికి గురై సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చిన బాధితురాలి మృతదేహాన్ని అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆమె స్వస్థలానికి చేర్చనున్నారు. నేడు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేడు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దక్షిణ ఢీల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు నిన్న మృతి చెందడంతో దేశం యావత్తూ విషాదంలో మునిగిపోయింది.