తమిళనాడులో అగ్ని ప్రమాదం: నలుగురు మహిళా ఉద్యోగులు మృతి
తమిళనాడు,ఏప్రిల్ 25:తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంక్లో గురువారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు.బ్యాంక్ పనుల్లో అందరూ నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.ఆ మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనం అయ్యారు. భవనంలోని మూడవ అంతస్తులో బ్యాంకు ఉన్నట్లు సమాచారం.భవనం చాలా పెద్దగా ఉండడం వల్ల మంటలు అంతటా వ్యాపించాయి.తీవ్ర స్థాయిలో మంటలు ఎగిసి పడుతున్నాయి.మరో 20 మంది భవనంలో చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు.బ్యాంక్ అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.అధికారులు సహయక చర్యలు ముమ్మరం చేశారు.