తీహార్‌ జైలు అధికారల నుంచి నివేదిక కోరిన హోంశాఖ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యపై కేంద్ర హోంశాఖ తీహార్‌ జైలు అధికారులను నివేదిక కోరింది. తీహార్‌ జైల్లోని 3వ నెంబర్‌ బ్యారాక్‌లో ఈ తెల్లవారుజామున 5 గంటలకు రాంసింగ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.