తెలంగాణ ఐకాస సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ ఐకాస ‘సత్యాగ్రహ దీక్ష’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ ఉదయం ప్రారంభమైంది. దీక్షలో ఐకాస అధ్యక్షుడు కోదండరాం, ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు పాల్గొన్నారు. రెండ్రోజులపాటు ఈ దీక్ష కొనసాగనుంది. భాజపా నేత సుష్మాస్వరాజ్‌ , సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం తదితర నేతలు దీక్షాస్థలికి వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్లు నేతలు తెలిపారు.