తెలంగాణ మీరు ఇవ్వకపోతే మేం ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్‌డీఏ ఇస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణపై యూపీఏ అవలంబిస్తోన్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ అంశాన్ని ఆయన లోక్‌సభలో బుధవారం లేవనెత్తారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చేందుకు బిజెపితో పాటు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం, ఉద్యమకారుల్ని అణచి వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం చాలా ఏళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించకుంటే కాంగ్రెస్‌ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. ఉద్యమాన్ని తక్కువజేసి చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.్‌