తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి,నవంబర్‌13 (జనంసాక్షి) : దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ అధినేత మాజీ సిఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. సమాజంలో హింసా, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు అని చంద్రబాబు నాయుడు అన్నారు. బలహీనులపై దాడులు, దౌర్జన్యాలు అంతమైన శుభదినం అన్నారు. రాక్షసత్వంపై మానవత్వం విజయం సాధించిన పర్వదినం అని ఆయన పేర్కొన్నారు. అరాచకాల చీకట్ల నుంచి ఆనందపు వెలుగుల వైపు నడిపించే వెలుగు దివ్వెల పండుగ దీపావళి అని ఆయన పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారుఅందరికీ నరక చతుర్దశి, దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ విూరంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ఈ దీపావళి విూకు సకల శుభములు చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.