త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన అరికిల్ల అంజలి కమాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి త్రిబుల్ ఐటీ లో సీటు సాధించగా ఆల్ ఎంప్లాయీస్ సోవియట్, ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, బహుజన నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంజలి అంజలితో పాటు ఆమె తల్లి శ్యామలను శాలువాతో సన్మానించి నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. అంజలి తల్లి శ్యామల తన భర్త లేకపోయినప్పటికీ కమాన్పూర్ లో హోటల్ లో పనిచేస్తూ తన కూతురిని చదివించింది. దీనికి ఫలితంగానే అంజలి బాసర త్రిబుల్ ఐటీ లో సీట్ సాధించి తన తల్లి శ్రమకు గుర్తింపు తీసుకువచ్చింది. త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన అంజలికి ఇనుగంటి మురళీధర్ రావు రూ. 516 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సన్మాన కార్యక్రమానికి ముందు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు లింగమల్ల శంకర్, నాయకులు వెంకటస్వామి, దాసరి రామస్వామి, పొనగంటి రాజనర్సు, అంబటి కనకయ్య, జనగామ రవికుమార్, భూ పెళ్లి మల్లేష్, గందం కృష్ణ , బొంకూరి అజయ్ , జంగపల్లి లక్ష్మణ్, శ్రీనివాస్, కసా రవి, చిప్పకుర్తి సత్యనారాయణ, నక్క శంకర్, స్వామి, నరసింగం తదితరులు పాల్గొన్నారు.