త్వరలోనే పార్క్ స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణం:కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సౌభాగ్యనగర్ కాలనీలో  పార్కు స్థలానికి ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ని కోరడంతో.
స్పందించిన కార్పొరేటర్  జిహెచ్ఎంసి డీ ఇ  దామోదర్ రావు తో కలిసి కాలనీలో పర్యటించి, త్వరలోనే పార్క్ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు పవన్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు ఆంజనేయులు, సెక్రటరీ ఆదిశేష, ఉపాధ్యక్షులు నందకిషోర్, జాయిన్ సెక్రటరీ విల్సన్ రావు, లక్ష్మణరావు, సలహాదారులు వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.