దీపావళి వేడుకల్లో పాల్గొన్న విరుష్క జంట

ముంబయి,అక్టోబర్‌28(జనం సాక్షి ): టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, ఆయన సతీమణి, ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన సాంప్రదాయ దుస్తులు ధరించిన ఈ సెలెబ్రిటీ కపుల్‌ అభిమానులు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విరాట్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొంటూ.. అందరికీ హ్యాపీ దీవాళీ, ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనుష్క సైతం ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మా తరఫున విూకు, విూ కుంటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అని తెలిపిన అనుష్క.. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని
కోరారు. అలాగే, టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్‌ పుజారా తన సతీమణితో, మనోజ్‌ తివారి తన కుటుంబంతో కలిసి దీపావళి ఉత్సవాన్ని జరుపుకొని, ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.