దూరదర్శన్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఢిల్లీలోని మండిహౌస్‌ ప్రాంతంలోని దూరదర్శన్‌ కార్యాలయంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఐదో  అంతస్తులో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. 22 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.