దేశంలో మూడో కరోనా మరణం

]కోవిడ్ దెబ్బకు మహారాష్ట్రలో మరొకరు మృతి

• దేశంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి తక్షణ చర్యలకు రంగంలోకి దిగిన కేంద్రం

• వైరస్ నిర్ధారణ పరీక్షలు నిరంతరంగా సాగాలి అనుమానితులను గుర్తిస్తూనే ఉండాలి

• ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు న్యూఢిల్లీ,మార్చి 17(జనంసాక్షి):

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైర తో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, తాజాగా మంగళవారం మరొకరు చనిపో యారు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర ముంబయిలో 64 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యు లు నిర్ధారించారు. కరోనా లక్షణాలతో ఈ వృద్ధుడు కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహారాష్ట్రలో మొత్తం 36 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక కలబురాగికి చెందిన 76 ఏళ్ల వృద్దుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ.. మిగతా 2లో.. కరోనా వైరస్లో గతవారం మృతి చెందిన విషయం విదితమే. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం ఉద్దవ్ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సినిమా హాల్స్, షాపింగ్ మాలను మూసివేశారు. అన్ని ఎన్నికలను కూడా వాయిదా వేశారు. దేశ వ్యాప్తంగా 126 కేసులు.. 13 మంది డిశ్చార్జ్ దేశంలో కరోనా కేసుల సంఖ్య 126కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఇందులో 104 మంది ఇండియన్స్ కాగా.. 22 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని పేర్కొంది. కరోనాతో చికిత్స పొందుతూ కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీలో 69 ఏళ్ల మహిళ, మహారాష్ట్రలో 64 ఏళ్ల వ్యక్తి మరణించగా.. దేశ వ్యాప్తంగా 13 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 15 రాష్ట్రాలకు కరోనా వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 39 మంది వైరస్ బారినపడ్డారు. కేరళలో 24 మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. హర్యానాలో ఇప్పటి వరకు 14 మంది విదేశీయులు మాత్రమే కరోనా పేషెంట్లు చికిత్స పొందుతుండగా.. మంగళవారం ఉదయం తొలి లోకల్ కేసు నమోదైంది. తెలంగాణలో నలుగురు వైరస్ బారినపడ్డారు. తొలి పేషెంట్ డిశ్చార్జ్ కాగా.. మిగిలిన ముగ్గురు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఒక కరోనా కేసు నమోదైంది. రాష్ట్రంలో మరో వ్యక్తికి పాజిటివ్ రాష్ట్రంలో మరొకరికి కరోనా వైరస్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఐదు రోజుల కింద స్కాట్లాండ్ దేశానికి వెళ్లిచ్చిన హైదరాబాద్కు చెందిన వ్యక్తి (46) కి వైరస్ పాజిటివ్ గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆయనకు గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపింది. ఆ వ్యక్తి స్కాట్లాండ్ నుండి వచ్చిన మరుసటి రోజే జ్వరం రావడంతో.. నేరుగా గాంధీ హాస్పిటల్ లో చేరాడని వెల్లడించింది. బాధితుడితో కాంటాక్ట్ అయిన 11 మందిని గుర్తించామని, వారికి టెస్టులు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన నాలుగు కరోనా కేసుల్లో ఇప్పటికే ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగతా ముగ్గురు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఓ బాధితురాలి తండ్రికి వైరస్ నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఆమెతో కాంటాక్ట్ అయిన 28 మందిని క్వారంటైన్ లో ఉంచారు. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వ్యక్తితో 13 మంది కాంటాక్ట్ అయినట్టు గుర్తించి న అధికారులు.. వారిని కూడా క్వారంటైన్ చేశారు. ఇదిలావుంటే కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరోనా పై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పంపిన భువనగిరి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వాట్స్ అప్ గ్రూప్లో ఇద్దరు వ్యక్తులు కరోనా పై అసత్ ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు ఆ ఇద్దరితోపాటు, ఆ గ్రూప్ అడ్మిన్ పై కూడా కేస్ నమోదు చేశారు. అరెస్టయిన వారి పేర్లు భరత్ కుమార్, శివకుమార్, బాలు అని పోలీసు అధికారులు వెల్లడించారు. చేతిలో సెల్ ఫోన్ ఉందికదాని ఏదిపడితే ఎడాపెడా రాసేసి నలుగురికీ పంపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతకుముందే సోమవారం హైదరాబాద్ లోని చైతన్యపురిలో కరోనా వదంతులపై వాట్సాప్లో ఫేక్ మెసేజీలు పంపినవారిపై పోలీసులు కేసు పెట్టారు. మెసేజీలు పంపినవారిపై పోలీసులు కేసు పెట్టారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు నిరంతరంగా సాగాలి మహమ్మారి కరోనా వైరస ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెర్రోస్ కీలక సూచనలు చేశారు. అనుమానితులందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాధికి గురైన వారికి చికిత్స అందించడంతోపాటు… అనుమానితులను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ప్రాణాంతక వైరస్ పై గుడ్డిగా పోరాడితే నష్టమే మిగులుతుందని జెనీవాలో మీడియా సమావేశంలో హెచ్చరించారు. ‘వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మన ముందున్న చక్కటి మార్గం టెస్, టెస్ట్, టెస్ట్’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ ముందున్నాయని తెలిపారు. అనుమానితులను గుర్తించి, చికిత్స అందించడం ద్వారానే ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఇక అల్పాదాయ దేశాల పరిస్థితి మరీ దారుణంగా మారనుందని అన్నారు. అసలే పోషకాహార లోపంతో, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి వైరస్ సోకితే నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి.. రోగగ్రస్తుల్ని ఐసోలేషన్ వార్డుల్లో పెట్టకపోతే.. మనుషుల మధ్య వైరస్ వ్యాప్తి జరిగి.. నియంత్రించడం కష్టమవుతుదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రాణాంతక కోవిడను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు తీర్మానం చేయడం.. నిధులు సమకూర్చుకోవడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అది నిధుల విషయని కాకుండా.. మానవతా స్ఫూర్తి అని కొనియాడారు. కాగా, కరోనాపై పోరుకు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను చేసే ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపిన విషయం విదితమే. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను మోదీ విరాళంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో సైతం కరోనా పంజా విసురుతోంది. అనుమానితులను గుర్తించడంలో ఆ దేశం విఫలమవడంతో వైరస్ వ్యాప్తి పెరిగింది. అక్కడ మూడు వేలకు పైగా జనం వైరస్ బారిన పడగా.. 62 మంది మరణించారు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో ట్రంప్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం 2000 ల్యాబ్లను అందుబాటులోకి తెస్తున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. వ్యాధికి గురైన వారికి చికిత్సలు పరీక్షలు చేయాలని ప్రపంచ దేశాలకు ఒక్కో కుటుంబానికి