దేశరాజధానిలో కొనసాగిన ప్రదర్శనలు
న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి మరణానికి సంతాపంగా దేశరాజధాని నగరంలో నిరసన ప్రదర్శినలు కొనసాగుతున్నాయి. జంతర్మంతర్ వద్ద వందలాదిమంది సమావేశమై మృతురాలికి శ్రద్దాంజలి ఘటించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకునేందుకు కఠినచట్టాలు చేయాలిని ఉద్యమకారులు డిమాండ్ వ్యక్తం చేశారు.