దేశరాజధానిలో భద్రత పెంపు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో భద్రతను పెంచారు. మంగోల్‌పురి ప్రాంతంలో పాఠశాల విద్యార్థిని అత్యాచారానికి గురికావడంపై ప్రజలు ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. ప్రజల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.