నరసింహయ్య మృతికి ఏచూరి సంతాపం

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): సైద్దాంతిక నిబద్దతకు, అంకితభావానికి నరసింహయ్య మారుపేరని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. ఢిల్లీ నుండి ఫోన్‌లో తెలకపల్లి రవితో మాట్లాడిన ఆయన నరసింహయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు నరసింహయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిపిఎం ఆంధద్రేశ్‌ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ గఫూర్‌ తదితరులు సంతాపాన్ని తెలియచేశారు.