నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అన్న సీఎం

రాజమండ్రి : అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టంపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామి ఇచ్చారు. త్వరలో నీలం తుపాను బాధితులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.