నిధులివ్వాలని కోరుతూనే ఉన్నాం – చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీకి రావాల్సిన నిధులివ్వాలని ఎప్పటికప్పుడు కేంద్రాన్ని కోరుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం సహకరిస్తే ఏపీ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఢిల్లీలో పీవీ నరసింహరావుకు స్మారక కట్టడం నిర్మించాలని, ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తెలిపారు.