నిమజ్జన ఘటనలో విషాదం

రాజస్థాన్‌ నదిలో పదిమంది మునక

జయపుర,అక్టోబర్‌9 (జనం సాక్షి):  రాజస్థాన్‌ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పర్బతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురి మృతదేహాలు బయటపడినట్లు ధోల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రాకేశ్‌ జైశ్వల్‌ తెలిపారు. మృతల కుంటుంబాలకు సీఎం రిలిఫ్‌ ఫండ్‌ నుంచి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీసేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు.