నిమ్మగడ్డ బెయిల్పై విచారణ 8కి వాయిదా
న్యూఢిల్లీ, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 8 కి వాయిదా వేస్తోన్నట్లు ప్రకటించింది. కాగా, సీబీఐ విచారణకు తాను సహకరిస్తున్నందున బెయిల్ మంజూరు చేయాలని నిమ్మగడ్డ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.