నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

న్యూఢిల్లీ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి నిమ్మగడ్డ కేసు బదలాయించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిజ్జర్‌ సూచించారు.