నిర్భయ్‌ క్షిపణి పరీక్ష విఫలం

న్యూఢిల్లీ : భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యం మార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నార్భయ్‌ మిస్సైల్‌ను రూపొందించిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ – డీఆర్‌డీవో మాత్రం తమ ప్రాజెక్టు సగం విజయవంతమైందని, మిగిలిన సగం విషయంలో ఇంకా కృషిచేయాలని పేర్కొంది. ఒడిశాలోని చండీపూర్‌ నుంచి దీన్ని ప్రయోగించారు.