నేటి నుంచి ఐకాస ధర్నా చేపట్టినున్న తెలంగాణ

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నేటి నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెండ్రోజులపాటు తెలంగాణ ఐకాస ధర్నా చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యమకారులు ఢిల్లీకి తరలివస్తున్నారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ధర్నా ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.