నేడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బెంగళూరులో నిర్వహించే ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. మోడీ ప్రచారం తమకు కలిసివస్తుందని అధికార భాజపా భావిస్తోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌, అగ్రనేత అద్వానీ, సుష్మా స్వరాజ్‌ తదితరులు పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.