నేడు మారిషన్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ : మారిషన్‌ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన సోమవారం మారిషన్‌ వెళుతున్నారు. ఈ సందర్భంగా మారిషన్‌ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్‌ పుర్యాగ్‌తో రాష్ట్రపతి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో భారత్‌తో మారిషన్‌ ఆరోగ్యం, పర్యాటకం, సామాజిక రంగాలకు చెందిన పలు ఒప్పందాలు కుదుర్చుకుంటుందని రాష్ట్రపతి మీడియా కార్యదర్శి తెలిపారు.