నేడు రాంసింగ్‌ మృతదేహానికి శవపరీక్ష

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ కొనసాగుతోంది. రాంసింగ్‌ మృతదేహానికి ఈ రోజు ఎయిమ్స్‌లో శవపరీక్ష నిర్వహించనున్నారు. ఆరుగురు నిందితుల్లో ఒకరైన రాంసింగ్‌ నిన్న తెల్లవారుజామున తీహర్‌ జైల్లోని బ్యారాక్‌ నెంబర్‌ 3లో దుస్తులతో ఉరివేసుకున్నాడు. అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తీహార్‌ జైల్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.