నేడు సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్న కమల్‌నాథ్‌

న్యూడిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ ఈరోజు లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కోరనున్నారు. 2జీ, బొగ్గుకుంభకోణం అంశాలపై గత కొన్ని రోజులుగా భాజపా పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆందోళన చేపట్టి ప్రధాని, న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.