నేతాజీ సేవా రత్న పురస్కార్ కు ఎంపిక

నేతాజీ సేవా రత్న పురస్కార్ కు ఎంపిక

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : నేతాజీ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నేతాజీ సేవా రత్న పురస్కార్ కు అడ్వకేట్ రాజలింగు మోతె ఎంపికయ్యారు. సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాను చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలకు గాను ఆయనఈ పురస్కారానికి ఎంపిక కాగా, రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన వివిధ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు రాజలింగును అభినందించారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని రాజలింగు అన్నారు. నేతాజీ వరల్డ్ రికార్డ్స్ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ సబర్మతి ఆర్గనైజేషన్ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ చెన్నూర్ నియోజక వర్గ అధ్యక్షులు తుంగ వెంకటేష్, టిఆర్ఎస్ యువ నాయకులు కలవల సతీష్ కుమార్, తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.