నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

కాఠ్‌మాండూ: నేపాల్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాటోంగ్‌ జిల్లా నుంచి కాఠ్‌మాండూకి వెళ్తున్న బస్సు మహాదేవస్థాన్‌ రోడ్డుమార్గంలోకి రాగానే 300 మీటర్ల లోతున్న గొయ్యిలో పడిపోయింది.

ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 24 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. బస్సులో లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.