నేపాల్‌ అధ్యక్ష పీఠంపై విప్లవ వనిత విద్యాదేవి

Untitled-1ఖాట్మండు,అక్టోబర్‌28(జనంసాక్షి):

భారతదేశానికి ఉత్తరాన.. ఆకాశాన్ని తాకుతున్న ట్లని పించే హిమాలయాలు. వాటి పాదాల చెత దా దాపు 1.5 లక్షల చదరపు కిలోవిూటర్ల వైశాల్యం లో విస్త రించిన నేపాల్‌. ఆ దేశ భూభాగం మొత్తంలో వ్యవసా యానికి పనికొచ్చే భూమి కేవలం 20 శాతం!  జనా భా చూస్తే దాదాపు 3 కోట్లు! అందరికీ అన్ని సౌకర్యా ల మాట అటుంచితే, కనీసం తిండిగింజలైనా దొరక ని పరిస్థితి. మరోవైపు ప్రజల్ని పీక్కుతినే రాజరికం. ఏళ్లుగా అనుభవించిన పీడన నుంచి విప్లవం జనిం చింది. ఆ ఎరుపులో నుంచి వికసించిన వేగుచుక్కే.. విద్యాదేవీ భండారి!2006లో విజయవంతమైన నేపా ల్‌ విప్లవోద్యమంలో కీలక పాత్రధారి విద్యాదేవీ భం డారి. మహిళా గెరిల్లాల దళాలను నడిపించడం ద గ్గర్నుంచి మహిళా రైతు కూలీలకు హక్కులకు పాఠా లు నూరిపోయడం వరకు అన్ని బాధ్యతలు ఆమెవే. భర్త మదన్‌ భండారీ.. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యునిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌) కార్యదర్శి. 1993లో ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. భర్త మరణంతో కుంగిపోకుండా.. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసింది విద్యాదేవి. (నిజానికి విద్యార్థి దశలోనే ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆమె.. మదన్‌ భండారీతో పెళ్లి తర్వాత కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.)ఇప్పటి సందర్భం.. నేపాల్‌ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవీ భండారి ఎన్నిక కావడం.కఠ్మాండులోని నేపాల్‌ పార్లమెంట్‌ భవనంలో బుధవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన విద్యాదేవీ.. ఆ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. సవిూప ప్రత్యర్థి నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఖుల్‌ బహదూర్‌ గురుంగ్‌ పై 100కుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉదయం నుంచి ¬రా¬రీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విద్యాదేవి భండారికి  నేపాల్‌ పార్లమెంటులోని మొత్తం 549 ఓట్లలో విద్యాదేవికి 327 ఓట్లు వచ్చాయి. నేపాలీ కాంగ్రెస్‌ కు చెందిన ప్రత్యర్థి కుల్‌ బహదూర్‌ గురుంగ్‌ కు 214 ఓట్లు పోలయ్యాయి. 47 మంది ఓటింగ్‌ కు గైర్హాజరు కాగా, 8 ఓట్లు చెల్లలేదు. ఒక సభ్యుడు సస్పెండ్‌ అయ్యారు. దీంతో, విద్యాదేవి భండారి అధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు స్పీకర్‌ ఒన్సారీ ఘర్తీ ప్రకటించారు. విద్యాదేవికి తన సొంత పార్టీ సీపీఎన్‌-యుఎంఎల్‌ తో పాటు 14 పార్టీలు మద్దతు తెలిపాయి.దివంగత సీపీఎన్‌-యుఎంఎల్‌ నాయకుడు మదన్‌ భండారి భార్య విద్యాదేవి భండారి. ప్రస్తుతం ఆమె అధికార సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.గత సెప్టెంబర్‌ లో నూతన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న నేపాల్‌ కు.. నెల లోగా కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకోవడం అనివార్యమైంది. ఈ పదవికి ఎన్నికయ్యేంతవరకు విద్యాదేవీ.. నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (యూఎంఎల్‌)కు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. రాచరికం అంతమైన తర్వాత 2008లో జరిగిన మొట్టమొదటి ప్రజాస్వమ్యయిత ఎన్నికల్లో నేపాల్‌ అధ్యక్షుడిగా రామ్‌ భరణ్‌ యాదవ్‌ ఎన్నికయిన సంగతి తెలిసిందే.