నేపాల్ లో భూకంపం.. 2300 వేలకు చేరిన మృతుల సంఖ్య

ఖాడ్మాండు: నేపాల్ లో భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. భూకంప మృతుల సంఖ్య 2300 వేలకు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ లో భూకంపం ధాటికి 8 మంది భారతీయులు మృతి చెందారు. మరో 500 మందికి పైగా భారతీయులను సహాయక బృందాలు భారత్ కు పంపించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ లో 3 లక్షల విదేశీయులు చిక్కుకున్నారు. అమెరికా 10 లక్షల డాలర్లను నేపాల్ కు ప్రకటించింది.