నోయిడాలో ఉద్రిక్తతలకు దారి తీసిన సమ్మె

నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో కార్మిక సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు పలు కార్లను, ద్విచక్రవాహ నాలను తగులబెట్టారు. ఒకటి రెండు చోట్ల కర్మాగారాల్లోంచి  పొగలువస్తున్నాయి. కార్యాలయాలు, కార్మగారాల మీద రాళ్లతో దాడి చేయడంతో పలుచోట్ల కిటికీలు, తలుపుల అద్దాలు పగిలిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఢిల్లీలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు నానా అవస్థా పడుతున్నారు. తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్న ట్యాక్సీల అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.