నోయిడా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 65 మంది అరెస్టు

న్యూఢిల్లీ : ట్రేడ్‌ యూనియన్ల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మొదటిరోజు నొయిడాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాల మీద రాళ్లు రువ్వడం, 25 వాహనాలను తగలబెట్టడం తదితర ఘటనలకు వీరు బాధ్యులని పోలీసులు పేర్కొన్నారు. నిన్నటి ఉద్రిక్త పరిస్థితి కారణంగా నోయిడా ప్రాంతాంలో విద్యాసంస్థలు ఈరోజు పనిచేయడం లేదు. హింసాత్మక ఘటనలపై విచారణ జరపాల్సిందిగా ఢిల్లీ రాష్ట్రప్రభుత్వం ఇద్దరు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.