పంజాబ్‌లో భారీగా హెరాయిన్‌ పట్టివేత

మౌలాలీ : పంజాబ్‌లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. మొహాలీలోని జిరక్‌పూర్‌లోని ఓ ప్లాట్‌లో రూ.130 కోట్ల విలువ చేసే హెరాయిస్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్లాట్‌ బయల బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ భార్య కారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన అనూప్‌ సింగ్‌ కొహ్లాస్‌కు విజేందర్‌సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు విజేందర్‌సింగ్‌తోపాటు మరో బాక్సర్‌కు హెరాయిన్‌ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజేందర్‌ సింగ్‌ అన్నారు.