పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తాం : సుప్రీం

న్యూఢిల్లీ : పర్యావరణ  అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారణ చేపడతామని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై హైకోర్టులో ఉన్న పిటిషన్లను బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలవరం విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లను కూడా జతచేసింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి హరిత ధర్మాసనం విచారణ చేస్తుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.