పాకిస్థాన్‌లో ఎన్‌కౌంటర్: ఐదుగురుఉగ్రవాదుల మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదులు మృతిచెందారు. కరాచీలోని కొత్త సబ్జిమండి రహదారిపై జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. కాగా, పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలోని కైదాబాద్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు హతమయ్యారు.