పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 19 మంది మృతి

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 5