పాక్‌లో బచాఖాన్‌ యూనివర్సిటీపై ఉగ్రదాడి

444

పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పెషావర్ లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఏడు చోట్ల బాంబులు పేల్చారు. యూనివర్సిటీ లోపల మూడు వేల మందికి పైగా విద్యార్ధులున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు విద్యార్ధులు మరణించారు. మరో 50 మంది విద్యార్ధులు గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.