పారిస్ చేరుకున్న ప్రధాని మోడీ

0k16d240తొమ్మిది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ పారిస్‌ చేరుకున్నారు. ఒర్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోడీకి.. ఫ్రాన్స్ క్రీడా మంత్రి థియెర్రీ బ్రెయిల్లార్డ్, ఫ్రాన్స్ లో భారత రాయబారి అరుణ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు ఆవరణలో తన కోసం వేచి ఉన్న భారతీయులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీతోపాటు.. ఉత్తరమెరికాలోని కెనడాలో ప్రధాని పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇంధనం, భద్రత తదితర రంగాల్లో ఆయా దేశాల సహకారం కోరనున్నారు. అటు మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో పెట్టుబడులను ఆహ్వానిచడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.