పార్లమెంటుకు బయల్దేరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు. సంప్రదాయబద్ధంగా అశ్వారూఢులైన సిబ్బంది రాష్ట్రపతిని ఆయన ప్రత్యేక వాహనంలో పార్లమెంట్‌ భవనానికి తీసుకునివస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.