పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌ ఒకటో గేటు వద్ద భైఠాయించి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం 48 గంటలపాటు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.