పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న షిండే

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే మధ్యాహ్నం ప్రకటన చేయనున్నారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. లోక్‌సభలో మధ్యాహ్నం 2 గంటలకు, రాజ్యసభలో 2.30 గంటలకు షిండే ప్రకటన చేస్తారని అధికారులు వెల్లడించారు.