పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25: పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.గురువారం ఉదయం ఉభయసభలు ప్రారంభంకాగానే బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో లోక్సభ రేపటి (శుక్రవారం)కి,రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.