పార్లమెంట్‌ ఎదుట టీఎంపీల ధర్న

ఢిల్లీ : పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. మొదటి గేటు ముందు బైఠాయించిన  ఎంపీలు జై తెలంగాణ, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని నినాదాలు చేస్తున్నారు. ధర్నాలో గుత్తా, వివేక్‌, పొన్నం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పాల్గోన్నారు.