పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ స్వాగత కార్యక్రమం అనంతరం కొలువుదీరిన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే విపక్షాల నిరసనలు మొదలయ్యాయి. నిరసనల మధ్య రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతోంది.