పిల్లలతో పనిచేయించుకున్నందుకు వేటు

లక్నో,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  విద్యార్థులతో పనులు చేయించుకున్న ఇద్దరు టీచర్లపై వేటు పడింది. ఒకరేమో కారును శుభ్రం చేయించుకుంటే.. మరొకరేమో వంట చేయించుకున్నారు. ఈ వరుస సంఘటనలు ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో చేసుకున్నాయి. గరిమా సరఫ్‌ అనే ప్రభుత్వ టీచర్‌ తన వైట్‌ కారును విద్యార్థులతో బుధవారం శుభ్రం చేయించుకుంది. ఈ సంఘటనను అక్కడున్న ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్‌ విూడియాలో వైరల్‌ చేశాడు. ఇక మరో పాఠశాలలో విద్యార్థులతో టీచర్‌ వంట చేయిస్తున్న ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇక ఈ రెండు ఘటనలపై ఉన్నతాధికారులు విచారణ చేయగా.. నిజమని తేలింది. దీంతో ఈ ఇద్దరు టీచర్లపై ఉన్నతాధికారులు వేటు పడింది.